కాంగ్రెస్ పార్టీ నుండి గొంగిడి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక..

కాంగ్రెస్ పార్టీ నుండి గొంగిడి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక..

రాజపేట (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన దాదాపు 300 మంది నాయకులు సోమవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేపట్టేందుకు. చెందేందుకు రానున్న ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నూతనంగా చేరిన వారిని ప్రస్తుతం నాయకులు సమన్వయం చేసుకొని పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. నూతనంగా చేరిన వారిలో దేవనపల్లి ఐలయ్య. నరసింహులు. ఆకుల నరసింహులు. చీసర్ల అంజయ్య. ఆకుల నాగరాజు. రాములు. నరసింహులు తో పాటు తదితరులు చేరగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు....