కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిసిన స్పీకర్      

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిసిన స్పీకర్      

 ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ ఇందేవార్ పాండే ను గురువారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాసరెడ్డి న్యూ ఢిల్లీలో కలిశారు.

న్యూఢిల్లీ లోని శాస్ర్తీ భవన్ లో పాండేను కలిసిన స్పీకర్ పోచారం బాన్సువాడ నియోజకవర్గానికి నూతనంగా 43 అంగన్వాడీ పాఠశాలలను మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.

సభాపతి పోచారం  వినతి పట్ల సానుకూలంగా స్పందించిన సెక్రటరీ  పాండే త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జహీరాబాద్ ఎంపీ బిబీ పాటిల్  ఉన్నారు.