ప్రభుత్వ ఉద్యోగుల పై సస్పెన్షన్ వేటు.. ఒక పార్టీ ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయులు..

ప్రభుత్వ ఉద్యోగుల పై సస్పెన్షన్ వేటు.. ఒక పార్టీ ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయులు..

నాగర్ కర్నూల్ : అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ఉత్తర్వులు జారి చేశారు. కొల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సోషల్ ఉపాధ్యాయుడు కె.రామ్ జి, ఉప్పునుంతల మండలం పులియా నాయక్ తండ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు కే.రాజులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.