హైదరాబాద్‌లో కేవలం రూ.10కే నోరూరించే రుచికరమైన బిర్యానీ...

హైదరాబాద్‌లో కేవలం రూ.10కే నోరూరించే రుచికరమైన బిర్యానీ...

ముద్ర,హైదరాబాద్:- మామూలుగా సింగిల్ బిర్యానీ అంటే ఈ రోజుల్లో కనీసం వంద రూపాయలు అయిన ఉంటుంది. వెజ్ బిర్యానీ కూడా వంద రూపాయల పైనే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే చోట మాత్రం కేవలం 10 రూపాయలకే నోరూరించే బిర్యానీని ఇస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్ పక్కన ఉండే ఆక్సా హోటల్‌ లో 10 రూపాయలకే వెజ్ బిర్యానీని ఇస్తున్నారు. అసలు ఈ 10 రూపాయలకి వెజ్ మీల్సే ఇవ్వరు ఈ రోజుల్లో. అలాంటిది ఆక్సా హోటల్ వారు మాత్రం 10 రూపాయలకే టేస్టీ వెజ్ బిర్యానీ ఇస్తున్నారు . అయితే ఈ బిర్యానీతో వారికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే మిగులుతుందట. అది కూడా మెయింటెన్స్, ఇతర ఖర్చుల కోసం సరిపోతుందట. కేవలం సొసైటీకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా 10 రూపాయలకు బిర్యానీ అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ఇది లాభాలను ఆర్జించడం కోసం విక్రయించడం లేదని, పేదవారి కడుపు నింపే ప్రయత్నం కోసం చేస్తున్నామని హోటల్ నిర్వాహుకులు తెలిపారు. ఈ బిర్యానీ అచ్చం ఇళ్లలో చేసుకునే విధంగా చాలా టేస్టీగా ఉందని ఇక్కడ తిన్న వాళ్ళు చెబుతున్నారు. దీనిలో ఆలు, టమాట, క్యాప్సికం, బఠాణి.. ఇలా అన్నీ వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ బిర్యానీ సెంటర్ రన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ బిర్యానీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఇక్కడ తినే సదుపాయమే కాకుండా పార్శిల్ సౌకర్యం కూడా ఉంది అని తెలిపారు. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఓసారి స్టేషన్ రోడ్డుకి వెళ్లి బిర్యానీ టేస్ట్ చేసి రండి.