జేపీఎస్ ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి

జేపీఎస్ ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
  • ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి
  • రేపు శనివారం ( 13-05-2023) మధ్యాహ్నం 12.00 గంటల లోగా విధులకు హాజరు కాని సెక్రెటరీ ల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలి

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి హైదరాబాద్ స‌చివాల‌యం నుండి శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి జేపీఎస్ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రేపు అనగా శనివారం ( 13-05-2023) మధ్యాహ్నం 12.00 గంటల లోగా విధులకు హాజరైన సెక్రెటరీ ల జాబితా పంపాలని జిల్లా కలెక్టర్ లు, dpo లను ఆదేశించారు.

సెక్రెటరీ లు విధుల్లో   చేరకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లకు ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి సూచించారు. ఏ గ్రామంలోనైతే సెక్రెటరీ లు విధులకు హాజరు కాలేరో సదరు సెక్రటరీ ల స్థానంలో అదే గ్రామానికి చెందిడిగ్రీ పూర్తి చేసి , కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని కొత్త సెక్రెటరీ లుగా తాత్కాలిక ప్రాతిపదికన  నియమించాలని జిల్లా కలెక్టర్ లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.