అణగారిన వర్గాల దిక్సూచి అంబేద్కర్

అణగారిన వర్గాల దిక్సూచి అంబేద్కర్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ఎస్సీ, ఎస్టీ, బీసీసహా అణగారిన వర్గాలకు దిక్సూచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, బడుగు, బలహీన, అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతి దిశగా కృషి చేయాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని, కేసీఆర్ ప్రభుత్వమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా కరీంనగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి పొగిడిందంటే అంబేద్కర్ గొప్పతనం అర్ధం చేసుకోవాలి.  ప్రపంచంలో ప్రజాస్వామ్యం రోజు రోజుకూ సన్నగల్లుతున్న తరుణంలో అందుకు భిన్నంగా 140 కోట్ల భారత దేశంలో ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతుందంటే అందుకు అంబేద్కర్ రాజ్యాంగమే కారణం అని కొనియాడారు.  సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందించాలనే ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి అంబేద్కర్, దేశ విభజనను, 370 ఆర్టికల్ ను వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.