నష్టపోయిన రైతులను ఆదుకోవాలి...

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి...
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి కెనాల్ దెబ్బతినడంతో దాని పరిసర ప్రాంత రైతులు వరద నీటితో తీవ్ర నష్టపోయారని వారిని తక్షణమే ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రెకొండ గ్రామంలోని దెబ్బతిన్న కెనాల్ ను పరిశీలించారు.   ఇరిగేషన్ శాఖ అధికారులు త్వరితగతిన నష్టాన్ని అంచనా వేసి  కెనాల్ పనులను పూర్తిచేయాలని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు దుడ్డెల లక్ష్మీనారాయణ, నాయకులు వంగర మల్లేశం, మండల కార్యదర్శి పడాల శ్రీనివాస్ గౌడ్, బిజెపి నాయకులు గండ్రతు రామయ్య, పీరాల్ల రవీందర్,  పెండ్యాల రాజేందర్, సంఘం సంపత్, పడాల ఆదిత్య, రైతులు రావుల తిరుపతిరెడ్డి, విలాసాగర వెంకన్న, ఆకారపు చంద్రయ్య, పిట్టల వెంకట్రాజం తదితరులు ఉన్నారు