అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో వర్గానికో చెందిన వారు కాదని యావత్ భారతానికే అస్తీ అని కొనియాడారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తాను అనుభవించిన సామాజిక వివక్ష తన వారు ఎదుర్కొవద్దని తపనపడ్డ మహానీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు.

సామాజిక అసమానత నిర్మూలనకోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భారతదేశపు ఆస్తిత్వపు ప్రతీకగా పేర్కొన్నారు. స్వర్గీయ అంబేద్కర్ ఆశయాలు విలువలను అనుసరిస్తూ దళిత బహుజన పేదవర్గాల అభ్యున్నతికి పాటుపడడమే ఆ మహానుభావునికి మనమిచ్చే అసలైన నివాళి అన్నారు. దళితుల అభివృద్ది కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకం ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు నాయకులు చల్లా హరిశంకర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు