శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నియామకం

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నియామకం

నియమకా పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కు నూతన కమిటీ నియామకమైంది. హుస్నాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం  ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.ఆలయ కమిటీ ఛైర్మెన్ గా గందే సంపత్ కుమార్, పాలకవర్గ సభ్యులు తాల్లపెళ్ళి కిరణ్ కుమార్, బొల్లబత్తిని మహేష్, గుండెకారి మాధవ్, శ్రీమూర్తి శ్రీనివాస్, మంతెన మహేందర్, బోల్లం వెంకటలక్ష్మిలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

అలాగే తమ నియామకానికి సహకరించిన ఎంపీపీ, జడ్పిటిసి, సింగిల్ విండో చైర్మన్,భారాస జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి,భారస మండల అధ్యక్షులు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఎంపీటీసీ లకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారాస జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, చిగురుమామిడి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణా రెడ్డి,భారస మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ రామోజు రజిత కృష్ణమాచారి, ఎంపీటీసీ మేడబోయిన తిరుపతి,  ఉపాధ్యక్షులు పెసరి రాజేశం, గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ము కొమురయ్య, వార్డ్ సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్, మాజీ ఎంపిటిసి సభ్యులు కాశబోయిన నరసయ్య, బొజ్జ మల్లేశం, బెజ్జంకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.