ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం
  • కళాశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి,ముద్ర;ఈ నెల 28 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  కళాశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి సంవత్సరం నుండి 165 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం నుండి 143 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రానికి అనుమతించేది లేదని గుర్తు చేశారు. పరీక్ష సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా మానసికంగా బలంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపర్డెంట్ నవనీత, డిపార్ట్మెంట్ ఆఫీసర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.