మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి గ్రామం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పది క్వింటాళ్ళ బియ్యం స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రేషన్ బియ్యం ఎవరు అక్రమ సరఫరా చేసినా చర్యలు తీసుకుంటామని ఎస్సై షరీఫ్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.