ఖానాపూర్ లో 250 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

ఖానాపూర్ లో 250 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

పీడిఎస్ బియ్యంగా అనుమానాలు
ముద్ర ప్రతినిధి నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో లారీ లో అక్రమంగా  తరలిస్తున్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోమవారం స్వాధీనపరుచుకున్నారు. వారు సేకరించిన వివరాల ప్రకారం బీహార్ నుండి జగిత్యాల జిల్లాకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. బీహార్ నుండి ఖానాపూర్ వరకు దాదాపు నాలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలు దాటి లారీ వచ్చినా పత్రాలపై కనీస స్టాంపింగ్ కూడా లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

దీనివెనుక అధికారుల హస్తం కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. లారీ తో పాటు బియ్యాన్ని ఇద్దరు వ్యక్తులను స్పెషల్ పోలీసులు స్పెషల్ పోలీసులు పౌరసరఫరాల శాఖ అధికారులకు శాఖ అధికారులకు స్వాధీనం చేశారు. వివరాలు తెలియాల్సి ఉంది. పిడిఎస్ బియ్యం అయి ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు. లారీతో సహా 250 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారులు.