పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత...

పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత...

ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ నేత‌, పార్టీ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త‌గూడెం నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న క్రిశాంక్‌ను న‌ల్ల‌గొండ జిల్లా ప‌రిధిలోని పంతంగి టోల్ ప్లాజా వ‌ద్ద అడ్డుకున్నారు. వాహ‌నం త‌నిఖీ పేరిట 30 నిమిషాల పాటు ఆయ‌న కారును ఆపారు. హైద‌రాబాద్ వెళ్లేందుకు అనుమ‌తించాల‌ని క్రిశాంక్ పోలీసుల‌ను కోరగా, ఉన్న‌తాధికారులు వ‌స్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

అనంత‌రం క్రిశాంక్ కారులోనే చౌటుప్ప‌ల్ క్రైమ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎక్కి.. చౌటుప్ప‌ల్ పీఎస్‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు. ఇదే అంశంపై క్రిశాంక్ స్పందిస్తూ.. త‌న‌ను ఎందుకు చౌటుప్ప‌ల్ పీఎస్‌కు తీసుకెళ్తున్నారో తెలియ‌డం లేద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే చౌటుప్ప‌ల్ నుంచి హైద‌రాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిసింది. కాగా, క్రిశాంక్‌పై నిన్న ఓయూ పీఎస్‌లో కేసు న‌మోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.