ఆటో ఢీ... బాలుడి మృతి
ముద్ర, కోరుట్ల:- కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ సంఘం దగ్గర శనివారం రోజున మినరల్ వాటర్ ఆటో డ్రైవర్ అజాగ్రత్తతో నడపడంతో ఇంటి ముందర బుడి బుడి నడకలతో ఆడుకుంటున్న పొట్ట సుధన్ వన్ (16) నెలల బాలుడిని ఆటో ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. బాబు మృతదేహాన్ని పోస్ట్ మార్టoకు తరలించారు. బాబు తల్లి పొట్ట అపూర్వ ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ని అదుపులోకి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.