జయకృష్ణకు జగన్ భరోసా...!

కుమ్మరకొండూరుకు చెందిన 20 ఏళ్ల దర్శిగుంట జయకృష్ణ 15 ఏళ్లుగా ఎదుగుదల లేక, నడక రాక అంతుపట్టని వ్యాధితో మంచానికే పరిమితం అయ్యాడు. తల్లి రాణమ్మ ఇంత వరకూ లక్షలు ఖర్చు చేసినా, ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. భర్తను కూడా పోగొట్టుకుని, కొడుకు వైద్యం కోసం ఇక ఖర్చు చేయలేని పరిస్థితిలో సహాయం చేయమని సీఎం వైఎయస్ జగన్ కు విజ్ఞప్తి చేసుకుంది. జయకృష్ణ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం ఆమెకు భరోసా కల్పించారు. జయకృష్ణ చికిత్సకు అవసరమైన సాయం అందించాలని ఆరోగ్యశ్రీ అధికారులకు సూచించారు.  - కుమ్మర కొండూరు, కలిగిరి మండలం, SPSR నెల్లూరు జిల్లా.