నాటు సారా స్థావరాలపై సీసిఎస్ పోలీసుల దాడులు
- సారా బట్టీలు ధ్వసం చేసిన పోలసులు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి మండలం తుమ్మనాల గ్రామ శివారులో గుడుంబా స్థావరాలపై సీసిఎస్ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఆకస్మిక దాడుల్లో గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన ముడి పదార్థాలు,13 లీటర్ల గుడుంబా, ఇతర సామాగ్రిని పోలిసులు స్వాధీనం చేసుకొని అక్కడ లభించిన నాటుసారా ముడిసరుకులు, డ్రమ్ములు ధ్వంసం చేశారు. విచారణ నిమిత్తం నింధితులను ధర్మపురి పోలీసులకు అప్పగించారు.