ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం
  • కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూయిజర్ కారు టైర్ పేలడంతో
  • సడెన్‌గా ఆగిపోయిన కారు...
  • ఉలిక్కిపడ్డ పోలీసులు
  • ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలుకాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
  • రేవంత్ రెడ్డి కొడంగల్ వెళుతుండగా ఘటన

ముద్ర, తెలంగాణ:- తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని టీజీ 09 ఆర్ఆర్ 0009 నంబర్ గల ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన కొడంగల్‌లో మండలాలవారీగా కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మ‌న్నెగూడ వ‌ద్ద కారు టైర్ పంక్చర్ అయింది. కాన్వాయ్‌లోని వారికి ఎవరికీ ఏమీ కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.