అభిమాన నేతకు అశ్రునివాళి
- ముగిసిన జర్నలిస్టు ఉద్యమ నేత ఆంజనేయులు అంత్యక్రియలు
- భారీగా తరలివచ్చిన ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే లీడర్లు, కార్యకర్తలు
ముద్ర, హైదరాబాద్: జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి ఆంజనేయులుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర గౌరవ సలహాదారు అంబటి ఆంజనేయులుతో వారికున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సోమవారం దుర్గాపురంలోని అంబటి ఆంజనేయులు నివాసానికి నేతలు వచ్చి అబంటి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులుర్పించి సంతాపం ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గరే బంధువులు, సన్నిహితుల సందర్శన అర్థం భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం గాంధీ నగర్ లో విజయవాడ ప్రెస్ క్లబ్కు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. జర్నలిస్టు యూనియన్ నాయకులు, జర్నలిస్టులు, నగర ప్రముఖులు ,రాజకీయ నాయకులు సందర్శించి అభిమాన నేతకు అశ్రునివాళులర్పించారు.
జర్నలిస్టుల అశ్రునయనాలతో అంబటి ఆంజనేయులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కృష్ణలంకలోని స్వర్గపురిలో అంబటి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. నివాళులర్పించినవారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమాశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్.బాబూరావు, వై.వెంకటేశ్వరరావు, దోనేపూడి కాశీనాథ్, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ కూన అజయ్బాబు, న్యూస్ ఎడిటర్ మోదుమూడి మురళీకృష్ణ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శులు డి.సోమసుందర్, వై.నరేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేశ్ కుమార్, కె.సత్యనారాయణ, ఐజేయూ నేతలు డి.కృష్ణారెడ్డి, కె.రాంనారాయణ, ఐజేయు సభ్యులు ఎస్కే.బాబు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్సు విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి, ప్రధాన కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావ్, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు, జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కస్తూరి, అధికార భాషా సంఘం చైర్మన్ పి.విజయబాబు, సీఆర్ మీడియా అకాడమి కార్యదర్శి తిలక్, ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫిషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, కార్యదర్శి వై.వి.రమణ, సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రమణరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా ఆంజనేయులు విలువలతో కూడిన సేవలు అందించారని సీపీఐ జాతీయ కె.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. సుదీర్ఘకాలం చివరి శ్వాస వరకు జర్నలిస్టుగా విలువలతో కూడిన సేవలు అందించారని కొనియాడారు.