దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే

దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముద్ర, ముషీరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యుత్ ప్రగతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నరని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకట్రావు, ఏడీఈ పాపయ్య, ముషీరాబాద్ ఎమ్మార్వో అయ్యప్ప, బిఆర్ఎస్ నాయకులు ముఠా జై సింహ తదితర విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు