దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ - ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠాగోపాల్​

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ - ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠాగోపాల్​

ముద్ర, ముషీరాబాద్​: సీఎం కేసీఆర్​ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలోల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని గాంధీనగర్​ లోని ముషీరాబాద్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్​ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  అశోక్​నగర్​ ప్రధాన దారిలో ఉన్న ఆచార్య జయశంకర్​ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం తొమ్మిదేండ్ల పాలనలో పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం వినూత్నంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుసుతన్నాయని చెప్పారు. ముషీరాబాద్​ నియోజకవర్గంలోనూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక మౌళిక సదుపాయాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్​ మాచర్ల పద్మజ, మాజీ కార్పొరేటర్​ముఠా పద్మ, బీఆర్​ఎస్​ పార్టీ డివిజన్​ అధ్యక్షుడు ముడారపు రాకేష్​కుమార్(ఎంఆర్​కె), నాయకులు ముఠా జైసింహ, నరేష్​, శ్రీనివాస్​గుప్తా, శ్రీకాంత్​, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.