దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ - ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్
![దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ - ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_6479839227d3a.jpg)
ముద్ర, ముషీరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలోల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని గాంధీనగర్ లోని ముషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అశోక్నగర్ ప్రధాన దారిలో ఉన్న ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం తొమ్మిదేండ్ల పాలనలో పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం వినూత్నంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుసుతన్నాయని చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోనూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక మౌళిక సదుపాయాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మాచర్ల పద్మజ, మాజీ కార్పొరేటర్ముఠా పద్మ, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ముడారపు రాకేష్కుమార్(ఎంఆర్కె), నాయకులు ముఠా జైసింహ, నరేష్, శ్రీనివాస్గుప్తా, శ్రీకాంత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.