లక్ష్మారెడ్డి మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ

లక్ష్మారెడ్డి మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ

మహాదేవపూర్, ముద్ర: కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన మండల రైతు సమన్వయ అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి తినివాళిగా గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వెన్నెపరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఓడేటి పద్మా రవీందర్ రెడ్డిల ఆధ్వర్యంలో బండం లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  వారి కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా భగవంతుడు చల్లగా చూడాలని వేడుకున్నారు. లక్ష్మారెడ్డి చేసిన అభివృద్ధి, సేవ కార్యక్రమాలను గుర్తు చేసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, అనేకమంది మహిళలు పాల్గొన్నారు.