యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చింతకుంట్ల కృష్ణారెడ్డి

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చింతకుంట్ల కృష్ణారెడ్డి

భూదాన్ పోచంపల్లి,ముద్ర; భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రానికి చెందిన చింతకుంట్ల కృష్ణారెడ్డి శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన  యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ సురేష్, జిల్లా అధ్యక్షులు బర్రి నరేష్, అసెంబ్లీ అధ్యక్షులు అవేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ కోఆర్డినేటర్ గునిగంటి రమేష్ గౌడ్, నాయకులు బండారు ప్రకాశ్ రెడ్డి, మక్తాల నరసింహ, గ్యార సందీప్, చేరాల సుధీర్ ,జింకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.