మల్కాజ్‎గిరి‎లో హై అలర్డ్..!

మల్కాజ్‎గిరి‎లో హై అలర్డ్..!
  • ప్రధాని మోడీ రోడ్​ షో నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం

ముద్ర, తెలంగాణ బ్యూరో : మల్కాజిగిరిలో హై అలర్ట్​ కొనసాగుతోంది. లోక్​ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్​ కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్కాజ్‎గిరిలో 1.5 కిలోమీటర్ల మేర విజయ సంకల్ప రోడ్ షో లో పాల్గొనున్నారు. దీంతో మోడీ పర్యటించే ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. ప్రధానంగా ఈ రోడ్డు మార్గాన్ని ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. కేరళ నుండి 4.50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న మోదీ.. రోడ్డు మార్గం ద్వారా మీర్జాలగూడ చౌరస్తాకు చేరుకుంటారు. 5.15 నిమిషాలు నుండి మొదలుకొని 6.15 నిమిషాల వరకు ఈ రోడ్ షోలో పాల్లొంటారు.

దీంతో ఈ మార్గంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా భారీకేట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇరువైపులా ఉన్న షాపులను సైతం మూయించేశారు. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ చేసిన ఎస్పీజీ బృందం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసులు సహా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ రోడ్డు మార్గంలో వెళ్లేటటువంటి వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాల్సిందిగా ఇప్పటికే సూచనలను జారీ చేశారు పోలీసు అధికారులు. దీంతో మోడీ ప్రయాణించే మార్గాలన్నీ హై అలెర్ట్‎గా కనిపిస్తోంది.