మేడ్చల్ జిల్లా కీసరలో దారుణం... ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు

మేడ్చల్ జిల్లా కీసరలో దారుణం... ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు

ముద్ర,తెలంగాణ:- క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేశ్​ కుమార్​కు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సురేశ్​స్వస్థలం లాలాపేట్, అతని భార్య భాగ్యది మారేడ్ పల్లి.. వీరు కీసరలో స్థిరపడ్డారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

తమ చావుకి కారణం క్రెడిట్ కార్డ్ అధికారులు అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టారు. క్రెడిట్ కార్డు సంబంధించిన అధికారులు ఇంటికి వచ్చి బిల్లు కట్టమని ఇబ్బంది పెట్టడంతో, స్థానికంగా ఉన్న ఇరుగుపొరుగు ముందు తమ పరువు పోయిందని మానసికంగా ఇబ్బంది పడినట్లు నోట్​లో రాసిపెట్టారు. వారు పిల్లలను బంధువుల ఇంటికి పంపి, ఈ దారుణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.