భీష్మించుకొని... మహిళ న్యాయ పోరాటం...

భీష్మించుకొని... మహిళ న్యాయ పోరాటం...
  • "ఖని" చౌరస్తా లో ఉద్యోగం కోసం పద్మ మౌన దీక్ష

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: అధికారులు తన హోంగార్డు ఉద్యోగాన్ని తొలగించారని,  తొలగించిన ఉద్యోగాన్ని వెంటనే ఇప్పించాలని కోరుతూ రెండు రోజులుగా  గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని జంక్షన్ వద్ద మాజీ మహిళా హోంగార్డు పద్మ న్యాయ పోరాటం చేస్తూ బైఠాయించింది. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా మౌన దీక్ష చేపడుతుంది. నడి చౌరస్తాలో న్యాయపోరాటం చేస్తున్న మహిళ వద్దకు కనీసం పోలీస్ అధికారులు వచ్చి జరిగిన సంఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీంతో మహిళకు స్థానికుల నుంచి మద్దతు పెరుగుతుంది. పోలీసుల వైఖరి పట్ల ప్రజా సంఘాల్లో  విమర్శలకు దారితీస్తుంది. ఏది ఏమైనా పద్మ చేపట్టిన న్యాయపోరాటంలో విజయం సాధిస్తుందా..? లేదా అన్నది ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.