బిగ్ బ్రేకింగ్ న్యూస్ - పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదు...
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- వాలంటీర్లపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద ఈ కేసు నమోదైంది. వాలంటీర్లు, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ మాట్లాడారని కేసులో ప్రభుత్వం తెలిపింది.
ఈ కేసును పరిగణనలోకి తీసుకున్న గుంటూరు జిల్లా కోర్టు.. ఈనెల 25న విచారణకు రావాలని పవన్ కళ్యాణ్ని ఆదేశించింది. ఈ కేసును నాలుగో అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.తాజాగా కోర్టు విచారణకు పిలవడంతో.. ఏం జరుగుతుందో అనే టెన్షన్ జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో ఉంది. టీడీపీతో కలిసి ఎన్నికల ప్రచారానికి జనసేన రెడీ అవుతున్న సమయంలో ఈ కేసు ఆ పార్టీకి సమస్యగా మారేలా కనిపిస్తోంది.