రేపు మంథని లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం చేయండి...

రేపు మంథని లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం చేయండి...
  • మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: రేపు 13-04-2024 శనివారం రోజున ఉదయం: 10.00 గంటలకు మంథని నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరిఖని రోడ్డులోని శివ కిరణ్ గార్డెన్స్ లో సమావేశం కలదని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్యులు తొట్ల తిరుపతి యాదవ్ తెలిపారు. ఈ కార్యమానికి తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొంటారని, ఈ కార్యక్రమం లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ మరియు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని శాసన సభ్యులు పాల్గొంటారని, ఈ కార్యక్రమన్ని మంథని నియోజకవర్గ అన్ని విభాగాల నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవాల్సిందిగా తిరుపతి యాదవ్ పిలుపునిచ్చారు.