గంగాపూరిలో గంగాజలం
- మిషన్ భగీరథ ప్రధాన గ్రిడ్ పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి చేరుతున్న నీళ్లు
- పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
- పట్టించుకోని అధికారులు
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని మునిసిపాలిటీ పరిధిలోని గంగాపురి లో గాంగ జాలం చేరింది. బస్టాండ్ నుండి ముత్తారం వైపు వేసిన మిషన్ భగీరథ ప్రధాన గ్రిడ్డు పైప్ లైన్ ఆదివారం మధ్యాహ్నం పగిలిపోవడంతో నీళ్లు వృధాగా పోతున్నాయి. వృధాగా పోతున్న నీటితో గంగాపురిలోని డ్రైనేజీలు మురుగు నీటితో నిండి పొంగిపొర్లుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ ను మరమ్మతు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.