గోదావరి నదిలో మునిగిపోతున్న తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి

గోదావరి నదిలో మునిగిపోతున్న తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి

ముద్ర,తెలంగాణ:- ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో మునిగి ఓ చిన్నారి మరణించింది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లాలో వేసవి తాపం తాళలేక గోదావరిలో స్నానానికి తండ్రి, కూతురు వెళ్లారు. అయితే… స్నానం చేస్తూ గోదావరి నదిలో మునిగిపోయాడు తండ్రి. దీంతో ఒక్కసారిగా అతని కూతురు నిఖితా ఉలిక్కిపడింది.

అనంతరం తండ్రిని కాపాడేందుకు చెయ్యి అందించబోయి ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది కూతురు నిఖితా. అటు ప్రాణాలతో తండ్రి రాజేందర్ బయటపడ్డాడు. మంగపేట (మం) కమలాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిఖితా వయస్సు 14 ఏళ్లు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.