ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రక్.. 8 మంది స్పాట్ డెడ్

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రక్.. 8 మంది స్పాట్ డెడ్

ముద్ర,సెంట్రల్ డెస్క్:- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి – ఆగ్రా హైవేపై ఆర్టీసీ బస్సును ఇవాళ ఉద యం ట్రక్కు ఢీకొట్టింది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.