ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. వివేకా హత్య కేసు డైరీని సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోరింది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. ఆధారాలు సేకరించిన తరువాతే ఉదయ్ని అరెస్టు చేశామని తెలిపింది. ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ తన కౌంటరులో పునరుద్ఘాటించింది. వివేకా హత్య, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ ప్రమేయం ఉందని సీబీఐ చెప్పింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులను ఈ నెల 15 కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.