పులివెందుల సీఐపై విచారణకు ఎస్ఈసీ ఆదేశం
పులివెందుల సీఐపై విచారణకు ఎస్ఈసీ ఆదేశించారు. పట్టభద్రుల ఎన్నికల్లో సీఐ రాజు వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్. విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని డీజీపీని, కడప కలెక్టర్ను ఆదేశించిన ఎన్నికల ప్రధాన అధికారి.