సినీనటి హేమకు మరోసారి నోటీసులు...

సినీనటి హేమకు మరోసారి నోటీసులు...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలో హేమ రక్తనమూనాలను పరీక్షించగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెకు తొలిసారి నోటీసులు ఇచ్చారు.

జూన్ 1న హాజరు కావాలంటూ... ఈ నెల 27వ తేదీన విచారణ నిమిత్తం బెంగళూరుకు రావాలని హేమను కోరారు. అయితే తనకు వైరల్ ఫీవర్ ఉందని, తనకు కొంత సమయం కావాలని హేమ కోరారు. ఈ మేరకు హేమ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని అందుకు అంగీకరించిన పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మరి జూన్ 1న హేమ విచారణ కోసం బెంగళూరు వెళతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.