ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్...

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ ఫారెస్ట్ ఏరియాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు ఎస్పీ ప్రభాత్‌కుమార్ ధ్రువీకరించారు.