గెలుపొందిన అభ్యర్థులకు ఫామ్ 22 ధ్రువీకరణ పత్రాలు అందుచేత.

గెలుపొందిన అభ్యర్థులకు ఫామ్ 22 ధ్రువీకరణ పత్రాలు అందుచేత.
  • ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణ.
  • కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జిల్లాలో శాసన సభ ఎన్నికల సందర్బంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు గెలుపొందిన ఆయా నియోజక వర్గాల అభ్యర్థులకు  ఫామ్ 22 ధ్రువీకరణ పత్రాలు ఆయా నియోజక వర్గాల ఆర్.ఓ లు అందచేయడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. హుజూర్ నగర్ నియోజక వర్గం నుండి  గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్. పద్మావతి, సూర్యాపేట నుండి బి.ఆర్.ఎస్. అభ్యర్థిగా జి. జగదీశ్ రెడ్డి అలాగే తుంగతుర్తి నుండి కాంగ్రేస్ అభ్యర్థిగా ఎం. సామేలు గెలుపొందారని కలెక్టర్ తెలిపారు ఆయా నియోజక వర్గాల కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలో సంబంధిత ఆర్.ఓ.లు గెలుపొందిన అభ్యర్థులకు ఫామ్ 22 ధ్రువీకరణ పత్రాలు అందచేశారు. జిల్లాలో కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.