నాటి జర్నలిస్ట్ నేటి ముఖ్యమంత్రి...

నాటి జర్నలిస్ట్ నేటి ముఖ్యమంత్రి...

ముద్ర ప్రతినిధి ,పెద్దపల్లి: ఒకనాటి జర్నలిస్టు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నాడని, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ విన్న సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఆ పేరులోనే దాగుంది. ఫైర్ బ్రాండ్ అని ఆ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సీఎం కాబోతున్నాడని, జోరుగా ప్రచారం జరుగుతుంది. అతడే కాంగ్రెస్ పార్టీలో సైనికుడిలా తయారైనా రేవంత్ రెడ్డి గతంలో జర్నలిస్ట్ గా పనిచేశాడన్న విషాయం చాల మందికి తెలియదు. ఇప్పుడు అ జర్నలిస్ట్ నేడు తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నాడు.

మూడు దశాబ్దాల క్రితం రేవంత్ రెడ్డి  జాగృతి, వార్త పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశాడు, అప్పడు యుక్త వయసులో ఎంతో చలాకీగా ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి జర్నలిస్టుగా కూడా పని చేశాడా... అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక జర్నలిస్ట్ తెలంగాణ కు మొదటి సారి ముఖ్యమంత్రి కావడం జర్నలిస్టులకు గర్వకారణంగా ఉందని పలువురు జర్నలిస్టు అన్నారు.