లింగ బసవేశ్వర స్వామికి వెండి గొడుగు బహుకరణ

లింగ బసవేశ్వర స్వామికి వెండి గొడుగు బహుకరణ

ముద్ర ప్రతినిధి, బీబీనగర్:  బీబీనగర్ మండలంలోని పడమటిసోమరం శ్రీ లింగ బసవేశ్వర స్వామికి అదే గ్రామానికి చెందిన ఎన్ ఎఫ్ సి కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి- మహిపాల్ గౌడ్ దంపతులు వెండి గొడుగును బహుకరించారు. సుమారు 6 లక్షల వ్యయంతో దీన్ని తయారు తయారు చేయించారు.

ఆలయ చైర్మన్ సందిగారి బస్వయ్య, ఎండోమెంట్ అధికారి నరేందర్ రెడ్డి లకు సోమవారం వారు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున  ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఆలేటి బలరాం, ఆల్వ గోపాల్ రెడ్డి, వంటల శ్రీశైలం, నడికుడి వెంకటేష్, బుర్రి శివ లింగం, గొరికంటి సుజాత, ఎక్స్ ఆఫీషియో సభులు రామ్ సింగ్, ఆలయ పూజారి పుణ్యాసింగ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆలేటి రామ కొండల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆల్వ రామకృష్ణ రెడ్డి, బద్దం అంజయ్య, తంతరపల్లి ప్రదీప్ గౌడ్, సందిగారి చందు, మల్లేష్, గండు రాజు తదితరులు పాల్గొన్నారు.