ఆలయ ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరించిన మంత్రి

ఆలయ ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరించిన మంత్రి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్ : బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవం, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.

శనివారం ఉదయం గూడూరు మాజీ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి మంత్రిని, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస రెడ్డి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాన సత్యనారాయణ, ముష్కే జైపాల్ రెడ్డి, తొర్రి కిషన్, జేరిపోతుల బాలయ్య, బింగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.