ఘనంగా రాహుల్  జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్  జన్మదిన వేడుకలు

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ఎఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ... రైతులు ఎవరు అధైర్య పడవద్దని రానున్న రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టమల్ల రవీందర్,  నాయకులు  వంగ కనకయ్య, ఠాగూర్ నరేందర్ సింగ్, శ్రీనివాసరెడ్డి, కాటం రత్నాకర్ రెడ్డి, గాదేపాక సునీల్, పీచు మల్లారెడ్డి, మాచ మల్లయ్య,  తిరుమలరెడ్డి, కాంతాళ మహిపాల్ రెడ్డి, బండ సంపత్,   రాజి రెడ్డి, మండల్ మీడియా సెల్ అధ్యక్షులు బోయిని  వేణు,  యువజన కాంగ్రెస్ నాయకులు రెడ్డి యాదగిరి, గట్టు ప్రశాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.