మేడిగడ్డ నుండి 14826 క్యూసెక్కుల నీరు తరలింపు

మేడిగడ్డ నుండి 14826 క్యూసెక్కుల నీరు తరలింపు

మహదేవపూర్, ముద్ర: సరస్వతి బ్యారేజ్( అన్నారం) నుండి గత ఆరు రోజులుగా ప్రతిరోజు 14,826 క్యూసెక్కుల నీటిని ఎగువకు తరలిస్తున్నారు. గోదావరి నదిలో ప్రతిరోజు 25986 క్యూసెక్కుల నీరు ప్ ప్రవహిస్తుండడంతో లక్ష్మీ బ్యారేజ్( మేడిగడ్డ) జలాలతో నిండుగా మారింది. శనివారం నాటికి లక్ష్మీ బ్యారేజీ లో 9.8 టీఎంసీల నీరు నిలువ ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ నుండి ప్రతిరోజు 14,826 క్యూసెక్కుల నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. ఆరు మోటర్ పంపులు గత ఆరు రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు సాగునీటివి ఎత్తిపోస్తున్నాయి. సరస్వతి బ్యారేజీలో 3.03 టీఎంసీలు నీరు నిలువ ఉంది. సరస్వతి (అన్నారం) బ్యారేజ్ నుండి ఇదే సామర్థ్యంతో ఎగువకు ఎత్తిపోస్తున్న జలాలతో ఎస్సారెస్పీ ఇతర ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారు.