పగటిపూట వెలుగులు

పగటిపూట వెలుగులు

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డులో 24 గంటల పాటు వీది దీపాలు వెలుగుతూ పగలే వెన్నెల చూపిస్తున్నాయి. రాత్రివేళ వెలగాల్సిన వివిధ దీపాలు గత నెల రోజులుగా 24 గంటల పాటు వెలుగుతూనే ఉంటున్నాయి. విద్యుత్ను ఆదా చేయాలని ప్రచారాలు చేస్తున్నప్పటికీ 24 గంటలు వీది దీపాలు వెలుగుతున్నా  ఎలాంటి స్పందన లేకపోవడం విచిత్రం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్తును ఆదా చేయాలనీ, రాత్రిపూట వీధి దీపాలు వెలిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.