భాజపా యువమోర్చాలో యువకుల చేరిక
ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు శనివారం భారతీయ జనతా పార్టీ మండల యువ మోర్చాలో ఎల్లారెడ్డిపేట మండల యువ మోర్చా అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కృషి చేస్తారని యువతను స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండ కడుతామని ప్రతినిత్యం ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి, సన్నత్ రెడ్డి , సింగారం బూత్ అధ్యక్షులు దిలీప్,మధు,ప్రవీణ్ జాషువా,అభిలాష్, సందీప్, లోహిత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.