ఆస్ర్టేలియాపై భారత్​ విక్టరీ

ఆస్ర్టేలియాపై భారత్​ విక్టరీ
  • అజేయ భాగస్వామ్యంతో రాణించిన రాహుల్​, జడేజా
  • 1–0 తో ముందంజలో టీమిండియా
  • 19న విశాఖలో రెండో వన్డే

న్యూఢిల్లీ: భారత్​– ఆస్ర్టేలియాల మధ్య కొనసాగుతున్న డే అండ్​ నైట్​ వన్డే మ్యాచ్​లో భారత్​ఘన విజయం సాధించింది. టాస్​ గెలిచి భారత్​ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్​కు దిగిన ఆస్ర్టేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 35.4 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​తక్కువ పరుగుల వద్దే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెఎల్​ రాహుల్​, రవీంద్ర జడేజాల అజేయ భాగస్వామ్యం భారత్​ను విజయతీరాలకు చేరేలా చేసింది. కేవలం 39.5 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. దీంతో భారత్​ మూడు వన్డేల సీరియస్​లో 1–0తో ఆధిక్యతలో ఉంది. రెండో వన్డే విశాఖపట్టణంలో 19వ తేదీన జరగనుంది. 

ఆస్ర్టేలియా పరుగులు: ట్రావీస్​ హెడ్​ (5), మిచెల్​ మార్ష్​ (81), స్టీవెన్​ స్మిత్​ (కెప్టెన్​) (22), లబూషేన్​(15), జోష్​ ఇంగ్లీస్​(26), కామెరూన్​ గ్రీన్​ (12), గ్లెన్​మాక్స్​వెల్​ (8), స్టోయినీస్​(5), అబ్బోట్​ (0), మిచెల్​ స్టార్క్​(4నాటౌట్​), ఆడమ్​ జంపా (0). 

వికెట్లు: మహ్మద్​ షమీ (3), మహమ్మద్​ సిరాజ్​ (3), రవీంద్ర జడేజా (2), హర్ధిక్​ పాండ్యా (1),  కుల్​దీప్​ యాదవ్​ (1).
భారత్​పరుగులు: ఇషాన్​ఖాన్​ (3), శుభ్​మన్​గిల్ (20), విరాట్​ కోహ్లీ (4), సూర్యకుమార్​ యాదవ్​ (0), కెఎల్​ రాహుల్ (75నాటౌట్​), హర్ధిక్​ పాండ్యా (25), రవీంద్ర జడేజా (45నాటౌట్​).
వికెట్లు: మిచెల్​ స్టార్క్​(3), స్టోయినీస్​ (2).