విజృంభించిన ముంబయి బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ
ముంబయి: డబ్ల్యూపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. నేటితో లీగ్ మ్యాచ్లు ముగియనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్తో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల 9 నష్టానికి 125 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ (29; 38 బంతుల్లో 3 ఫోర్లు) రాణించగా.. రిచా ఘోష్ (29; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడింది. స్మృతి మంధాన (24; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. సోఫీ డివైన్ డకౌట్ కాగా.. హెథర్ నైట్ (12), కనికా అహుజా (12) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. శ్రేయంకా పాటిల్ (4), మేఘన్ స్కట్ (2), దిశా కాసాట్ (2) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో అమేలియా కెర్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాట్ సీవర్, ఇస్సీ వాంగ్ రెండేసి వికెట్లు తీశారు. సైకా ఇషాక్ ఒక వికెట్ పడగొట్టింది.