కార్తీక్ రెడ్డి కుటుంబానికి ఇన్స్యూరెన్స్ చెక్కు

కార్తీక్ రెడ్డి కుటుంబానికి  ఇన్స్యూరెన్స్ చెక్కు

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు గడ్డం కార్తీక్ రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ తరపున ఇన్సూరెన్స్ ద్వారా సహాయం అందింది. బీఆర్ఎస్ తరఫున రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య ఆదివారంనాడు మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో కార్తీక్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు గడ్డం వెంకట్ రెడ్డి, మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.