ఎల్ఓసి చెక్కు అందజేత

ఎల్ఓసి చెక్కు అందజేత

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని గౌస్ కొండ గ్రామానికి చెందిన వంగూరి మల్లేష్ కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన 2,50,000 రూపాయల ఎల్ ఓ సి చెక్కును మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.