పద్మవిభూషణ్ చిరంజీవికి ఆర్యవైశ్యమహాసభ సత్కారం

పద్మవిభూషణ్ చిరంజీవికి ఆర్యవైశ్యమహాసభ సత్కారం

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: టాలీవుడ్ దిగ్గజ నటుడు, తన నటనతో యావత్ తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించిన నటుడు, మెగాస్టార్ చిరంజీవిని యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మంగళవారం సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా నటుడు చిరంజీవిని ఆయన స్వగృహంలోనే కలిసిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు, బీబీనగర్ కు చెందిన మల్లగారి శ్రీనివాస్ కలిసి శాలువ, పూలబొకేతో సన్మానించారు. ఆయనతో పాటు ఆర్యవైశ్య మహాసభకు చెందిన పలువురు ప్రతినిధులు కూడా ఉన్నారు.