వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు ...

వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు ...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో అటు నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇటు ప్రధాన పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర తూర్పు గోదావరిలో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లో ఈ రోజు జగన్ రోడ్ షో కొనసాగనుంది. పిఠాపురం లో పవన్ ను ఓడించేందుకు వైసీపీ కొత్త స్కెచ్ సిద్దం చేసింది. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. గోదావరి జిల్లాల్లో టీడీపీ,జనసేన నేతల పైన వైసీపీ గురి పెట్టింది.పిఠాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన పంతం ఇందిరతో సహా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు జగన్ న కలిసారు. పంతం నెహ్రూ, పంతం ప్రసాద్ వైసీపీ కండువా కప్పుకున్నారు.