ప్రతి టీడీపీ కార్యకర్త నా కుటుంబ సభ్యుడే

ప్రతి టీడీపీ కార్యకర్త నా కుటుంబ సభ్యుడే
  • అభివృద్ధి పరుగులు పెట్టాలంటే చంద్రబాబు రావాలి
  • రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత

ముద్ర ప్రతినిధి, ఏపీ: ప్రతి టీడీపీ కార్యకర్త తమ కుటుంబ సభ్యులతో సమానమని పరిటాల సునీత అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా  రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, ఎంసీ పల్లి పంచాయతీ, తిమ్మాపురంలో టీడీపీ నాయకులతో కలసి పరిటాల సునీత పర్యటించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటేసి, టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లకు పిలుపు నిచ్చారు. వైసీపీ అసమర్థత కారణంగా ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ మళ్లీ తిరిగి పట్టాలెక్కాలంటే చంద్రబాబు రావల్సిందేనని ఆమె అన్నారు. అభివృద్ధి మళ్లీ పరుగులు పెట్టాలంటే, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చాను.