సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

హైదరాబాద్ : సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. 'మనదేశం' చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన తెలుగు సినిమాను విశ్వవిఖ్యాతం చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌ వర్ధంతి ఉన్న తరుణంలో హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ ను నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించారు.

తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఈ క్రమంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. జై ఎన్టీఆర్, సీఎం అంటూ నినాదాలు చేశారు.